హిందుస్థాన్ జిందాబాద్’

29 Mar, 2016 02:02 IST|Sakshi
హిందుస్థాన్ జిందాబాద్’

సిటీబ్యూరో: మహా నగరంలోని ముఖ్య కూడళ్లలో ‘హిందుస్థాన్ జిందాబాద్’ ‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ  మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లు  ఏర్పాటు చేస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాను ఎట్టి పరిస్థితుల్లో ‘భారత్ మాతాకీ జై’ అననని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.

అదేవిధంగా ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సైతం అక్కడి అసెంబ్లీలో అదే వ్యాఖ్యలు చేసి సస్పెండైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యనేత షాబాజ్ ఖాన్ ముఖ్య కూడళ్లలో ‘ హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ పార్టీ అధినేత, అగ్రనేతలతో కూడిన ఫోటోలతో పెద్దఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లను ఏర్పాటుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది.

 

>
మరిన్ని వార్తలు