రోడ్డుప్రమాదంలో హెచ్ఎంటీవీ కెమెరామెన్ మృతి

8 Sep, 2016 01:07 IST|Sakshi
రోడ్డుప్రమాదంలో హెచ్ఎంటీవీ కెమెరామెన్ మృతి

హైదరాబాద్ : నగరంలోని మొట్టుగుడ వద్ద బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్ఎంటీవీ కెమెరామెన్ సత్యం మృతి చెందారు. విధులు ముగించికుని కీసరగుట్టలోని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... గాంధీ ఆసుపత్రి  మార్చురీకి తరలించారు. సత్యంకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు