ఉద్యాన విద్యార్థుల ధర్నా

7 Nov, 2016 16:09 IST|Sakshi
హైదరాబాద్: ఉద్యానశాఖలోని ఉద్యాన విస్తరణాధికారి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యాన డిప్లొమా విద్యార్థుల సంఘం ఆందోళనకు దిగింది. సోమవారం మధ్యాహ్నం సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని వార్తలు