గృహిణి ఆత్మహత్య

26 Feb, 2015 17:32 IST|Sakshi

హైదరాబాద్ క్రైం: అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని లాలగూడ పరిధిలోని విజయపురికాలనిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎం. గాయత్రి గురువారం ఉదయం వెంట్రుకలు నల్లగా మారడానికి ఉపయోగపడే నూనె తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో సూసైడ్ లెటర్ దొరికింది.

పెళ్లయినప్పటినుంచే అత్తింటి వాళ్లు వేధిస్తున్నారని, తాజాగా తనకూతురికి తనమీద లేనిపోనివి చెబుతున్నారని, భర్తతో పాటు అత్తమామలు ఆడబిడ్డ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్‌లో పేర్కొంది. గాయత్రి (38) కి లీలాప్రసాద్‌తో18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వారికి పదోతరగతి చదువుతున్న కూతురు ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు