భారీగా హవాలా సొమ్ము పట్టివేత

7 Jan, 2016 22:42 IST|Sakshi
భారీగా హవాలా సొమ్ము పట్టివేత

హైదరాబాద్: అక్రమంగా నగదును తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాహినాయత్ గంజ్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రూ.50 లక్షలను సంచుల్లో పెట్టుకుని ద్విచక్రవాహనాలపై వెళ్తున్న శ్యాంసుందర్ శర్మ, ఓం ప్రకాశ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి వద్దనున్న రూ.50 లక్షలను హవాలా మార్గాల్లో తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు సొమ్మును సీజ్ చేసి నిందితులను విచారిస్తున్నారు. ఈ హవాలా నగదు వెనుక బడా వ్యాపారవేత్తల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు