ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం..భారీ నష్టం

19 Dec, 2016 08:20 IST|Sakshi

హైదరాబాద్: పాతబస్తీ తలాబ్‌కట్టాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. స్థానిక రోడ్ నంబర్-2 జహంగీర్‌నగర్‌లోని షేక్ అన్వర్‌కు చెందిన ఫర్నిచర్ దుకాణంలో అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిందని యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు