మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు

12 Dec, 2014 08:23 IST|Sakshi

హైదరాబాద్: మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914 - నవంబర్ 11, 1918) ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్దం ముగిసి రేపటికి 96 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భంగా ఆనాటి అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం స్మరించుకోనుంది. చాదర్ఘాట్లోని మొదటి ప్రపంచ యుద్ధం స్మారక స్థూపం వద్ద రేపు శుక్రవారం ఆధికారికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, ప్రాన్స్, జర్మనీ కౌన్సిల్ జనరల్స్ పాల్గొంటారు.

మొదటి ప్రపంచం యుద్ధంలో 15 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. యుద్దంలో 75వేల మంది సైనికులు కన్నుమూశారు.
**

మరిన్ని వార్తలు