శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో ప్రతిపాదిత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం ఉదయం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయ విస్తరణలో ఎదురయ్యే పర్యావరణ సమస్యలపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.