హుస్సేనీఆలంలో కార్డన్ సెర్చ్

27 May, 2016 23:00 IST|Sakshi

హైదరాబాద్‌ : హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సౌత్‌జోన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కత్తి, మూడు డాగర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

అలాగే ఐదు మామిడిపళ్ల గోడౌన్లను సీజ్ చేశారు. ఆ క్రమంలో ఐదు బ్యాగుల కార్బైడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు బెల్ట్ షాపులను సీజ్ చేసి... 700 లిక్కర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

మరిన్ని వార్తలు