ఇదేమి ‘కృష్ణా!’

15 Sep, 2016 00:28 IST|Sakshi
ఇదేమి ‘కృష్ణా!’

చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న కృష్ణా పైప్‌లైన్‌ మరోసారి పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంచినీరు వృథాగా పోయింది. భారీ లీకేజీ ఏర్పడటంతో తాగునీరు ఫౌంటె న్‌లా  విరజిమ్మింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు లీకైన నీరు పక్కనే అ ల్‌ జుబేల్‌ కాల నీలోని ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పట్టాలపై కూడా నీరు చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఎట్టకేలకు సరఫరా నిలిపివేయడంతో లీకేజీకి తెరపడింది. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు.

మరిన్ని వార్తలు