రైళ్లలో వారు గుర్తింపు కార్డు చూపాల్సిందే!

8 Mar, 2017 00:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిలటరీ వారెంట్‌పై రైళ్లలో ఉచితంగా ప్రయాణించే రక్షణ శాఖ సిబ్బంది కచ్చితంగా గుర్తింపు ధ్రువపత్రం చూపాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే వారి కుటుంబసభ్యులైతే సంబంధిత శాఖ జారీ చేసిన మెడికల్‌ కార్డును చూపాలని పేర్కొంది.

కొందరు సాధారణ వ్యక్తులు మిలటరీ వారెంట్‌ పేరుతో రైళ్లలో ప్రయాణిస్తున్న ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గుర్తింపు కార్డులు చూపని వారిని ఉచితంగా ప్రయాణిం చేందుకు అనుమతించబోమని హెచ్చరించింది.

>
మరిన్ని వార్తలు