పవన్ కోరితే ప్రధాని మోదీతో భేటీ

28 Aug, 2016 20:09 IST|Sakshi
పవన్ కోరితే ప్రధాని మోదీతో భేటీ

గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటుందని బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఇప్పటికే చర్చలు జరుపుతోందని చెప్పారు.

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరితే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ వైఖరిని పవన్ తిరుపతి బహిరంగ సభలో తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు స్పందించారు. కాగా టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్లు మీడియా సమావేశంలో పవన్పై ఘాటైన విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు