ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

1 Mar, 2015 11:10 IST|Sakshi

మెహిదీపట్నం(హైదరాబాద్): ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని మెహిదీపట్నం భోజగుట్ట హిందూ శ్మశానవాటికను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు సమాచారం అందింది. కూల్చివేతకు ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ మల్లేష్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆసిఫ్‌నగర్ పోలీసుల సహకారంతో శనివారం అక్రమ నిర్మాణం వద్దకు వెళ్లి కూల్చివేత పనులు చేపట్టారు. బీజేపీ నేతలు అడ్డుకున్నప్పటికీ ఆమె లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలను కొనసాగించారు.

 

మరిన్ని వార్తలు