శంషాబాద్ : శంషాబాద్ మండలం ఘాన్సిమియాగుడలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను హెచ్ఎండీఎ అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించారని స్థానికులే ఫిర్యాదు చేయడంతో 200 మంది పోలీసు బందోబస్తుతో కట్టడాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.