చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన

14 Feb, 2015 09:37 IST|Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు.  'ప్రేమాలయం' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రాంపాల్.. అక్కడ ఉన్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. దాంతో వేధింపులు ఎక్కువ కావటంతో ఆ చిన్నారులు ఈ విషయాన్ని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యింది.

కాగా నిర్వాహకుడు రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ పునరావాస కేంద్రంలో ఉన్న 11మంది హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులతో పాటు మరో 18మందిని అక్కడ నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు