ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

2 May, 2016 22:53 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌  ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానశ్రయంలో దింపేశారు.

ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు