'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'

23 Dec, 2016 13:11 IST|Sakshi
'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'
జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జాతీయ రహదారులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో పాలకులు చేయలేనిది తాము రెండున్నరేళ్లలో చేశామని చెప్పారు. 
 
మొత్తం 2,776 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను నిర్మించామన్నారు. 18 జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. హైదరాబాద్ చుట్టూ మరో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.