అంతుచిక్కని దొంగల ముఠా ఆటకట్టు!

21 Jun, 2016 18:23 IST|Sakshi

హైదరాబాద్‌: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అంతుచిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర దొంగల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ముఠా వద్ద నుంచి 32 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా నగరంలో పలుచోట్ల 15 చోరీలు చేసినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు