'కొత్త జిల్లాల ఉద్యమానికి మద్దతు'

28 Aug, 2016 19:18 IST|Sakshi
'కొత్త జిల్లాల ఉద్యమానికి మద్దతు'
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలపై జరుగుతున్న ఉద్యమానికి జేఏసీ మద్దతిస్తుందని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామన్నారు.

జోనల్ వ్యవస్థపై లోతైన చర్చ జరగాలని కోదండరామ్ సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలు-డివిజన్లపై జేఏసీ అభిప్రాయాలను ప్రభుత్వానికి వెల్లడిస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు