సాక్షి, హైదరాబాద్: ఉద్యమానికి ఊపిరి పోసిన ఓయూకు వెళ్లాలంటేనే సీఎం కేసీఆర్ భయపడు తున్నాడని, ఇప్పుడు ఓయూలో టీఆర్ఎస్ సభ పెడితే కేసీ ఆర్పై రాళ్లు, చెప్పులే పడ్తాయని ప్రభుత్వ మాజీ విప్ టి.జయ ప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) హెచ్చరించారు. ఆదివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ ఓయూ విద్యార్థుల పై సీఎం కేసీఆర్ కక్ష కట్టాడన్నారు.
కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఓయూకు పోయినా రాళ్లు, చెప్పులు పడ్తాయనే భయంతోనే ఎవరూ ఓయూలో సభ పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఓయూలో రాహుల్గాంధీతో సమావేశం పెడ్తామని చెప్పినందుకే అక్కడ సభలు పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.