రాహుల్‌ సభతో టీఆర్‌ఎస్‌లో వణుకు

6 Jun, 2017 01:48 IST|Sakshi
రాహుల్‌ సభతో టీఆర్‌ఎస్‌లో వణుకు

మాజీ విప్‌ జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ సభతో టీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు మొదలైందని, దీంతో మంత్రి హరీశ్‌రావు మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ మాజీ విప్‌ జగ్గారెడ్డి అన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఆదరణ పెరిగిందని తేలడంతో టీఆర్‌ఎస్‌లో చేరాలంటూ కాంగ్రెస్‌ నేతలను మంత్రి హరీశ్‌రావు వేధిస్తున్నారని, హరీశ్‌ ఆదేశాలతోనే అమీన్‌పూర్‌ సర్పంచ్‌ను తొలగించారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలెవరూ భయపడొద్దని, వారికి అండగా ఉంటామన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌లో చేరాలని హరీశ్‌ అడిగినా ఒప్పుకోనందుకే తనను తొలగించారని అమీన్‌పూర్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు