బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ

18 Apr, 2016 18:14 IST|Sakshi
బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ

విజయవాడ: జమ్మలమడుగులో టీడీపీ పార్టీ నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి పంచాయతీ చేరింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి రామ సుబ్బారెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు.

ఆదినారాయణ వల్ల ఫ్యాక్షనిజం మళ్లీ పెరిగిందని కొద్ది రోజుల కిందట రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఆదినారాయణ రెడ్డ వర్గీయులు దాడి చేశారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడారు.

మరిన్ని వార్తలు