జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్?

7 Aug, 2015 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇంటర్‌బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. తొలిదశలో ఇంటర్ విద్యార్థులకు జూనియర్ కళాశాల్లో ఈ విధానాన్ని అమలు చేసి.. త ర్వాత అవసరం అనుకుంటే స్కూల్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లకూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని బోర్డు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు