కందిపప్పు డబుల్ సెంచరీ

15 Oct, 2015 02:44 IST|Sakshi
కందిపప్పు డబుల్ సెంచరీ

ఆల్‌టైమ్ రికార్డు ధర.. కిలో రూ.200
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కందిపప్పు ధర మండిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కేజీ ధర హోల్‌సేల్‌లోనే రూ.200కి ఎగబాకింది. రిటైల్ మార్కెట్‌లో మరో రూ.5 నుంచి రూ.6 అదనంగా గుంజుతున్నారు. కందిపప్పు ధర రూ.200 దాటడం ఎన్నడూ చూడలేదని వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తంలో కందిపప్పును నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించటంతో రేట్లు పెరిగిపోతున్నాయి. మినపపప్పు కూడా చుక్కలనంటుతోంది. హోల్‌సేల్‌లో కిలో రూ.185, రిటైల్‌లో రూ.190 పలుకుతోంది.

మరిన్ని వార్తలు