-

జాగృతి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక

7 Sep, 2017 02:40 IST|Sakshi
జాగృతి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక

కమిటీని ప్రకటించిన ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శులుగా టి.పూర్ణచందర్‌రావు, జి.సంతోష్, టి. రోహిత్, ఎన్‌. సాయికృష్ణ, ఎ.సోనియా, నల్లవెల్లి కపిల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా టి.రమేశ్, పీఆర్‌ఓగా ఎం. వంశీకృష్ణ ఎంపికయ్యారు.  ఈ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా కె. విజయ్‌ కుమార్, రాష్ట్ర కో–కన్వీనర్లుగా జలంధర్‌యాదవ్, వంగల శ్రీనివాస్, బక్కతట్ల వెంకట్, ఎజాజ్‌ హైదర్‌ ఇప్పటికే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో యువకులను భాగస్వాములు చేసే విధంగా ఈ సమాఖ్య పని చేయాలని కవిత వారికి సూచించారు.

మరిన్ని వార్తలు