సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018లో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.