19న పోలీస్‌ శాఖపై సీఎం సమీక్ష

6 May, 2017 03:12 IST|Sakshi
19న పోలీస్‌ శాఖపై సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖపై  చర్చకు సీఎం కేసీఆర్‌  సమయం కేటాయించారు. ఈ నెల 19న హెచ్‌ఐ సీసీ వేదికగా భేటీ నిర్వహించి పోలీస్‌ శాఖను ముందుకు తీసుకెళ్లేం దుకు కార్యచరణ రూపొందించాలని భావి స్తున్నారు.  ఎస్సై నుంచి డీజీపీ హోదా వరకు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న ప్రతీ ఒక్క అధికారి వచ్చే లా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, డీజీపీని ఆదేశిం చారు. ఏయే సమస్యలపై చర్చిం చాలి? వేటిని ప్రాధాన్యత అంశాల్లో చేర్చాలన్న దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్‌ ఎస్పీ సింగ్‌తో డీజీపీ అనురాగ్‌ శర్మ, కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌  భేటీ అయ్యారు.
 

>
మరిన్ని వార్తలు