ఈసారి ముందుగా ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం!

24 Aug, 2016 13:19 IST|Sakshi
ఈసారి ముందుగా ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం!

హైదరాబాద్:  నగరంలోని ఇతర వినాయక విగ్రహాల నిమజ్జనం కంటే ముందుగానే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగనుంది. బుధవారం హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలో వినాయక ఉత్సవాలపై సమావేశం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం ముందుగానే చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇంతకముందు నగర పరిసర ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలన్నీంటిని నిమజ్జనం చేసిన తరువాత ఎప్పటికోగానీ ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా ఖైరతాబాద్ గణనాథుడిని వచ్చే నెల 15న మధ్యాహ్నం 2 గంటల లోపే  నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, ముగ్గురు పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దని సూచించారు.

మరిన్ని వార్తలు