కాల్పుల కేసులో కిల్లర్‌ బాబు అరెస్ట్‌

16 Aug, 2016 12:23 IST|Sakshi
కాల్పుల కేసులో కిల్లర్‌ బాబు అరెస్ట్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకుడు దండుగుల యాదగిరిపై కాల్పుల కేసులో హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్‌ డక్కల బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజులుగా తాను లొంగిపోతానంటూ మీడియాకు ఫోన్లు చేస్తున్న బాబు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపాయాడు. మూడ్రోజుల క్రితం కాంగ్రెస్‌ నేత యాదగిరిపై బాబు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలు కిల్లర్‌ బాబుకు ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుపారీ కిల్లర్‌ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ( చదవండి: 'కిల్లర్‌ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది')

మరిన్ని వార్తలు