చెట్లు నాటితే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

8 Jul, 2016 10:12 IST|Sakshi

హైదరాబాద్ : చెట్లు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏడాదికి 42 కోట్ల చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలతోపాటు 108 ప్రైవేట్ సంస్థలు హరితహారంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు