'పార్కులు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు'

23 Jul, 2016 10:58 IST|Sakshi
'పార్కులు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు'

హైదరాబాద్ : పార్కులను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్లోని వెంగళరావు పార్కును కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... నగరంలో ఉన్న పార్కులను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పార్కులను దత్తత తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్లోని రోడ్లపై కొత్త ప్రణాళికలు తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. రోడ్ల పరిస్థితిపై వచ్చే వారం పూర్తి వివరాలు వెల్లడిస్తానని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ వెంటనే జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. గతంలో జలగం వెంగళరావు పార్కులోని దుస్థితిపై మంత్రి కేటీఆర్కి వాకర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్... ఈ పార్కును పరిశీలించారు.

ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ... పార్కులోని సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ పార్కును జలమండలి ఎండీ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు