పార్టీ వీడే ప్రసక్తే లేదు

12 May, 2016 03:30 IST|Sakshi
పార్టీ వీడే ప్రసక్తే లేదు

కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు
టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ

 సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం సంక్షోభంలో పడటమే కాకుండా, రైతన్నపై కరువు కోరలు చాస్తుంటే, మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు సాగించడమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. రమణ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు సహాయక చర్యల్లో వైఫల్యం చెందడమే కాక, అవకతవకల జల విధానం, మితిమీరిన అవినీతికి మారుపేరుగా మారిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ పబ్బం గడుపుతోందన్నారు. ఎంతో బాధ్యతాయుతమైన  పార్టీ అధ్యక్ష పదవిని, గౌరవాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీనీ వీడే ప్రసక్తి లేదని రమణ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు