స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

4 Sep, 2015 02:29 IST|Sakshi
స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు