స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు

7 Sep, 2015 17:30 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులకు భారీతా వేతనాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జెడ్పీ చైర్మన్లకు ప్రస్తుతం ఉన్న రూ.6 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. అదే విధంగా జెడ్పీటీసీలకు రూ.2,500 నుంచి రూ.6 వేలకు పెంచారు. ఎంపీపీలకు రూ.1500 నుంచి రూ.6 వేలకు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. సవరించిన వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
 

మరిన్ని వార్తలు