హైదరాబాద్: నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో లాకప్డెత్ జరిగింది. పోలీసులు విచారణ నిమిత్తం భీంసింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. శనివారం అతను పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులే భీంసింగ్ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
పోలీసులు భీంసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ రాంభూపాల్ రావు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని విచారిస్తున్నారు.