పిరికిపందల చర్య: కొనగల

6 Aug, 2017 02:32 IST|Sakshi
పిరికిపందల చర్య: కొనగల

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీపై జరిగిన దాడికి బీజేపీ అధినాయకత్వం క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో దారుణాలు, అరాచకాలు బాహ్యప్రపంచానికి తెలు స్తాయనే భయంతోనే బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు.ఇది పిరికిపందల చర్యన్నారు. దాడులకు బాధ్యతగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు అమిత్‌షాను అడ్డుకుంటా మని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు