కేసీఆర్ చదివింది కాంగ్రెస్ యూనివర్సిటీలోనే..

16 May, 2016 03:05 IST|Sakshi
కేసీఆర్ చదివింది కాంగ్రెస్ యూనివర్సిటీలోనే..

కేటీఆర్ గుర్తుంచుకోవాలి: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

 సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాంగ్రెస్ విశ్వ విద్యా లయంలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని, ఈ విషయం ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ గుర్తించుకొని మాట్లాడాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ అవినీతి విశ్వ విద్యాలయం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌లో ముఖ్య స్థానాల్లో ఉన్న కేకే, డీఎస్ వంటి వారు కూడా కాంగ్రెస్ నేతలేనన్న విషయాన్ని మరవొద్దన్నారు. టీఆర్‌ఎస్ నేతలు అబద్దాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించి పోయారని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు