బైక్‌పై భర్త మృతదేహాంతో భార్య అరెస్ట్

25 Sep, 2016 18:09 IST|Sakshi
బైక్‌పై భర్త మృతదేహాంతో భార్య అరెస్ట్

హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని బైక్‌పై ఎల్‌బీనగర్ -మైత్రీనగర్ నుంచి హయత్‌నగర్- అంబర్‌పేట్కు తరలిస్తున్న సమయంలో వారిని చూసిన స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటనకు సంబంధించి బైక్‌పై తరలిస్తున్న ప్రవళిక, ఉపేందర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మృతుడు ప్రవళిక భర్త పుల్లయ్యగా తేల్చారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పుల్లయ్య కోదాడలోని వ్యవసాయ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కోదాడ నుంచి ఎల్బీనగర్ వెళ్లి వస్తుంటాడు. ఉపేందర్‌తో ప్రవళిక వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పుల్లయ్యను హత్యచేసి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు