బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం

30 May, 2014 09:20 IST|Sakshi
బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం

హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం ఓ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నాన్ని బాలిక అడ్డుకోవటంతో వ్యక్తి ఆమెను గాయపరిచాడు. ప్రస్తుతం బాలిక ఒంటిపై కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు