జనతాగ్యారేజ్ బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నవ్యక్తి అరెస్ట్

1 Sep, 2016 11:37 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు.

వివరాలు ఇలా ఉన్నాయి... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతాగ్యారేజ్ చిత్రం గురువారం విడుదలైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులతోపాటు సినిమా చూసేందుకు వచ్చిన వారికి సదరు టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు