యువకుడిపై కత్తులతో దాడి

5 Mar, 2017 09:22 IST|Sakshi

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం సాయిదుర్గ బార్ ముందు చరణ్ అనే యువకుడిని గుర్తుతెలియని నలుగురు వ‍్యక్తులు కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సమీపంలోని ఆస‍్పత్రికి తరలించారు. దాడిచేసిన వ‍్యక‍్తులు పరారయ్యారు.

చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడిచేసిన వ‍్యక్తుల కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు