శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ల కలకలం

29 Dec, 2014 10:03 IST|Sakshi

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం బుల్లెట్లు దొరికిన ఘటన కలకలం రేపింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఢిల్లీ వెళుతున్న సునీల్ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు కనుగొన్నారు.  అతడిని అదుపులోకి తీసుకుని 9 ఎంఎం బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సునీల్ ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు