నాగోలు: పనిచేసిన షాపులో సామగ్రిని చోరీ చేసిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు జైపురికాలనీకి చెందిన సావ సంజయ్రెడ్డి(22) ఎల్బీనగర్ ఆరెంజ్ ఆసుపత్రి సమీపంలో శివశక్తి స్టీలు షాపులో గత కొన్ని రోజుల నుంచి సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి జల్సాలకు అలవాటు పడి షాపులో ఉన్న వెల్డింగ్ రాడ్స్, కటింగ్ మిషన్లతో పాటు రూ.1.20 లక్షల సామగ్రిని చోరీ చేశాడు.
ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన షాపు యజమాని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో సంజయ్ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సంజయ్ రెడ్డి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుని వద్ద నుంచి సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.