కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): నగరంలో కురిసిన అకాల వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సుభాష్నగర్లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి సుభాషనగర్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.
ఓ ఇంట్లో విద్యుద్ఘాతం సంభవించి సిద్దు(25) అనే యువకుడు మృతి చెందాడు. మృతునికి నెల పాప, ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నారు. ఇంటి ఆధారం కోల్పోయిన ఆ కుటుంబ తీవ్ర విషాదంలో ఉంది.