హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. కేపీహెచ్బీ బస్టాప్లో అందరూ చూస్తుండగానే దుండగులు ఓ వ్యక్తి గొంతు కోశారు. బాధితుడు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మరణించాడు.
మరణించిన వ్యక్తిని బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ రాజుగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.