హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో గుర్తు తెలియని వ్యక్తుల వరుస హత్యలు స్థానికులను కలవర పెడుతున్నాయి. రాజేంద్రనగర్ మండలం కాటేదాన్లో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సంచలనం రేపుతోంది. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్ పోసి తగులపెట్టారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి అనంతరం సంచిలో మూటకట్టి గుర్తు పట్టకుండా ఉండేందుకు తగులపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో వారంరోజుల్లో వరుసగా ఇదే తరహాలో మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి.