సికింద్రాబాద్: వరుడు పారిపోవడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఘటన సికింద్రాబాద్ లో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లి ముహూర్తానికి గంట ముందు పెళ్లికొడుకు సతీశ్ పారిపోయాడు. తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పి అతడు పరారయ్యాడు. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.
పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నిరాశగా వెనుదిరిగారు. తమ పరువు తీశారంటూ పెళ్లికొడుకు తరపు వారిపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీశ్ ఎందుకు పారిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.