హైదరాబాద్: నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు మూడోరోజు కొనసాగుతోంది. ఈ కూల్చివేతలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు. మల్కచెరువు, రాయదుర్గం చెరువుల్లో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అలాగే, చెరువు లోతట్టు ప్రాంతంలోని బఫర్ జోన్లో నిర్మించిన పెద్ద షెడ్డును కూల్చివేస్తున్నారు. మేయర్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి కూడా ఉన్నారు.