సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న 20 కి.మీల మెట్రో రైలు (మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్)కు ఏడుగురు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్(ప్లానింగ్), అహ్మదాబాద్లోని సెప్ట్ యూనివర్శిటీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చీఫ్ అర్బన్ ప్లానర్తోపాటు ప్రభుత్వం నియమించే ప్రైవేటు, ప్రభుత్వ ఒప్పందాల నిపుణుడు ఉంటారు.