హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే మిలాద్ ఉన్ నబీ వేడుకలు హైదరాబాద్ పాతబస్తీలో ఘనంగా జరిగాయి. పాతబస్తీ ప్రాంతంలో వేలాది మంది ముస్లింలు ప్రదర్శన నిర్వహించారు. మహ్మద్ ప్రవక్తను కీర్తిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మక్కా మసీదు నుంచి ప్రారంభమై మదీన, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా మొగల్పురా వరకు సాగింది.
రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా దేశవిదేశాల నుంచి వేలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పేద ముస్లింలకు దానం చేయడం, భోజనాలు పెట్టడంలాంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు.